Warangal: నెక్కొండలో దారుణం.. తల్లిదండ్రులను సజీవ దహనం చేసిన తనయుడు

  • భూ తగాదాలే కారణం
  •  ఇంట్లోనే దహనం చేసిన కేతియా
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

తల్లిదండ్రులనే సజీవదహనం చేసిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది. భూ తగాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మడిపల్లి గ్రామానికి చెందిన కేతియా అనే వ్యక్తి తండ్రి దశ్రు (65ఏళ్లు), తల్లి బాజీ( 61ఏళ్లు) లను ఇంట్లోనే సజీవ దహనం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.  

More Telugu News