Nalgonda: హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిపై నేడు ప్రకటన?

  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు 
  • రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు
  • నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక్కడి నుంచి టీడీపీ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారు. ఆ అభ్యర్థి ఎవరన్నది ఈరోజు తేలనుంది. ఈ విషయమై ఈరోజు ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు హైదరాబాద్ కు చంద్రబాబు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం టీ-టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయలో తుది నిర్ణయం తీసుకుంటారని, అనంతరం, ఈ మేరకు ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 21న ఉపఎన్నిక జరగనుంది. 24న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుపై ఇప్పటికే ఎనలేని ధీమాను వ్యక్తం చేశాయి.

More Telugu News