Chandrababu: మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలా అనే ఆందోళన ప్రజల్లో ఉంది: చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాజా పరిణామాలపై స్పందించారు. రాజధాని అమరావతిపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. రాజధాని చుట్టూ ముసురుకున్న పరిణామాలతో ప్రజలు సైతం కలత చెందుతున్నారని, మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలా అనే ఆందోళన వారిలో కలుగుతోందని అన్నారు. యువత కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగం కావాలంటే పరాయిరాష్ట్రానికి వెళ్లాల్సిందేనా? అనే భావన యువతలో ఉందని పేర్కొన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా విమర్శలు సంధించారు. జగన్ వైఖరి పట్ల రాష్ట్రంలో ఎవరూ సంతృప్తికరంగా లేరని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని, జాతీయ మీడియా సైతం జగన్ పద్ధతిని తప్పుబడుతోందని అన్నారు.
Chandrababu
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News