Telangana: ప్రగతిభవన్ లో ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

  • మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలి కేబినెట్ సమావేశం
  • నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణంపై చర్చ
  • బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  కూడా

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణంపైనా, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కాగా, రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2019-20 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీన్ని మంత్రి వర్గం ఆమోదించనుంది.  

More Telugu News