Aricel-Max: చిదంబరంకు జ్యుడీషియల్ రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జ్యుడీషియల్ కస్టడీ  
  • ఈ నెల 19 వరకూ తీహార్ జైల్లోనే చిదంబరం  
  • సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి షాక్ తగిలింది. ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 19 వరకూ ఆ జైల్లోనే చిదంబరం వుంటారు.

More Telugu News