Vikram Kapoor: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి

  • ఫరీదాబాద్ లో డీసీపీగా పని చేస్తున్న విక్రమ్ కపూర్
  • ఈ ఉదయం 6 గంటలకు ఆత్మహత్య
  • ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు

ఓ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి విక్రమ్ కపూర్ ఫరీదాబాద్ నగర డీసీపీగా పని చేస్తున్నారు. ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని పోలీస్ లైన్స్ లోని సెక్టార్ 30లోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఐపీఎస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

More Telugu News