chandrayan-2: చంద్రయాన్-2 ప్రయోగాన్ని విద్యార్థులకు చూపించండి: ఏపీ మంత్రి సురేశ్ ఆదేశాలు

  • రేపు మధ్యాహ్నం చంద్రయాన్-2 ప్రయోగం
  • ఈ ప్రయోగం ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయాలి 
  • చంద్రయాన్-2ను విద్యార్థులకు చూపించండి

రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డీఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఏపీ విద్యా శాఖ మంత్రి  సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. చంద్రయాన్-2 ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయాలని అన్నారు. ఈ ప్రయోగాన్ని విద్యార్థులకు చూపించాలని, డిజిటల్, వర్చువల్ తరగతుల ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

More Telugu News