India: ​టీమిండియాకు షాక్... 5 పరుగులకే 3 వికెట్లు డౌన్

  • భారత్ లక్ష్యం 240 రన్స్
  • 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • పేస్ కు అనుకూలిస్తున్న పిచ్

న్యూజిలాండ్ తో సెమీఫైనల్ లో 240 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కేవలం 5 పరుగుల స్కోరుకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (1)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మను మాట్ హెన్రీ అవుట్ చేయగా, కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డీఆర్ఎస్ లో కూడా కోహ్లీ అవుట్ అని తేలడంతో టీమిండియా శిబిరం నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 1 పరుగుకే అవుటయ్యాడు. మంగళవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇక్కడి పిచ్ పేస్ కు అనుకూలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 4 ఓవర్లు పూర్తి కాగా టీమిండియా స్కోరు 3 వికెట్లకు 5 పరుగులు. క్రీజులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు.

More Telugu News