Errabelli: అనుచరుడి మృతదేహం వద్ద ఎర్రబెల్లి కంటతడి

  • కరెంట్ షాక్ తో విజయ్ కుమార్ మృతి
  • ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైరు తాకడంతో ప్రమాదం
  • పదేళ్లుగా ఎర్రబెల్లి వెన్నంటే ఉన్న విజయ్ కుమార్

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తన అనుచరుడ్ని కోల్పోవడం పట్ల తీవ్ర విషాదానికి గురయ్యారు. రాయపర్తి మండలం ఫణ్యానాయక్ తండాలోని భూక్యా విజయ్ కుమార్ కరెంట్ షాక్ తో మరణించాడు. విజయ్ కుమార్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ కుమార్ ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైరును తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, గత పదేళ్ల నుంచి విజయ్ కుమార్ ఎర్రబెల్లి వెన్నంటే ఉన్నారు. ఎర్రబెల్లి ముఖ్య అనచురుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయ్ కుమార్ మరణించాడన్న విషయం తెలిసి ఎర్రబెల్లి చలించిపోయారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని చూస్తూనే కంటతడి పెట్టుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. శనివారం సాయంత్రం విజయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.

More Telugu News