Uttar Pradesh: మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోంది: అమిత్ షా

  • వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు
  • ఈ ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందింది
  • యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది

బీజేపీ కార్యకర్తల శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొనియాడారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, వారణాసి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ ఐదేళల్లో వారణాసి ఎంతో అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో వారణాసి ప్రపంచస్థాయి నగరంగా మారబోతోందని అన్నారు. యూపీ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని అన్నారు. 

More Telugu News