varun tej: 'వాల్మీకి' నుంచి తప్పుకున్న దేవిశ్రీ ప్రసాద్!

  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకీ'
  • తమిళ 'జిగర్తాండ'కి రీమేక్ 
  • త్వరలోనే నాయిక ఎంపిక   

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందుతోంది. కొంతకాలం క్రితం తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ .. సిద్ధార్థ్ పాత్రలో అథర్వ నటిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించగా, ఆమె ఎక్కువ పారితోషికం అడిగిందనే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ఆయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతోనే మిక్కీ జె. మేయర్ బిజీగా వున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు. 

More Telugu News