Andhra Pradesh: గుంటూరులో బైక్ ను ఢీకొట్టిన వాహనం.. ఘటనాస్థలంలోనే ఇద్దరు యువకుల దుర్మరణం!

  • జిల్లాలోని దాచేపల్లి వద్ద ఘటన
  • పోలీసులకు వాహనదారుల సమాచారం
  • మృతుల స్వగ్రామం బేధపూడిగా గుర్తించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాచేపల్లి వద్ద బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న పుట్ట జగదీశ్ రెడ్డి, లోటా బాలనాగిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదాన్ని అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, ఈ దుర్ఘటనలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు గుంటూరులోని బేధపూడి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News