Mahesh Babu: 'మహర్షి' నుంచి రెండవ సాంగ్ వచ్చేస్తోంది

  • వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి' 
  • రేపు సాయంత్రం 4.05 గంటలకు సెకండ్ సాంగ్
  • మే 9వ తేదీన విడుదల    

మహేశ్ బాబు కథానాయకుడిగా .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవల 'చోటి .. చోటి' అనే ఫస్టు సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో రెండవ సాంగ్ ను వదలడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు సాయంత్రం 4.05 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు.

మొదటి పాటకు మించి రెండవ పాట ఉంటుందని అంటున్నారు. మహేశ్ బాబు మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించడనుండటం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'భరత్ అనే నేను' సినిమాకి మించి ఈ సినిమా విజయాన్ని సాధిస్తుందని మహేశ్ బాబు అభిమానులు భావిస్తున్నారు.

More Telugu News