ntr: రాజమౌళి దృష్టిలో ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు

  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న డైసీ ఎడ్గర్ జోన్స్
  • మరో హీరోయిన్ కోసం వెతుకులాట 
  • శ్రద్ధా కపూర్ కి ప్రాధాన్యత

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన 'డైసీ ఎడ్గర్ జోన్స్'ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్ .. జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. 'సాహో'లో శ్రద్ధా కపూర్ పోర్షన్ దాదాపు పూర్తయిందట. అందువలన ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఏ కారణం చేతనైనా శ్రద్ధా కపూర్ నో చెబితే, జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే నిర్ణయంతో రాజమౌళి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. అజయ్ దేవగణ్ కీలమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, 2020 జూలై 30న విడుదల చేయనున్నారు. 

More Telugu News