Menaka Gandhi: రాహుల్ ఎన్నటికీ పీఎం కాలేరు: మేనకాగాంధీ

  • కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయింది
  • ప్రజల్లో ప్రాభవాన్ని కోల్పోయిన పార్టీ
  • అద్భుతం జరిగితేనే జగన్ కు అవకాశమన్న మేనకాగాంధీ

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఆయనకు పీఎంగా బాధ్యతలు చేపట్టే చాన్స్ రాదని మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. పలువురు నేతల అవినీతి వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

దేశంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ మరింత మెరుగుపడుతోందని, 2014 ఎన్నికల కంటే, అధిక స్థానాలను ఈ దఫా గెలుస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, ఈ లోక్ సభ ఎన్నికల్లో మేనకాగాంధీ సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తుండగా, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వరుణ్ గాంధీ చాలా సులువుగా విజయం సాధించనున్నాడని ఈ సందర్భంగా మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ఫిలిబిత్ లో బీజేపీ చేసిన అభివృద్ధే వరుణ్ కు అండగా నిలుస్తుందని అన్నారు.

More Telugu News