Chandrababu: ఈ డబ్బు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చింది?: హీరో రాజశేఖర్

  • ఎన్నికలకు ముందు ఓ బిస్కెట్ ‘పసుపు-కుంకుమ’
  • ఈ పరిపాలనను చాలా కంపు చేశారు
  • సింగపూర్ కంపెనీకి చంద్రబాబు ఏజెంట్

రాష్ట్రంలో ప్రతిదీ చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. అమరావతిని సింగపూర్ లా చేయడం కోసం అప్పులు ఎందుకు చేయడం? సింగపూర్ కంపెనీకి చంద్రబాబు ఏజెంట్ గా ఉంటూ, రైతుల దగ్గర తీసుకున్న భూములను కమీషన్ పద్ధతిలో ఆ కంపెనీకి అమ్మేశారని ఆరోపించిన రాజశేఖర్, ఇదా ముఖ్యమంత్రి చేసే పని? అని ప్రశ్నించారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, ఈ పరిపాలనను చాలా కంపు చేశారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు ఓ బిస్కెట్ వేసినట్టుగా ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చంద్రబాబు ఇంటి నుంచి తెచ్చారా? లేక ఆయన అత్తగారింటి నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. లేకపోతే సింగపూర్, మలేషియాలో ఉన్న ప్రాపర్టీస్ ను అమ్మేసి తీసుకొచ్చారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంచి చేయాలనుకుంటే డ్వాక్రా మహిళల రుణాలను ఎప్పుడో మాఫీ చేయాల్సింది అని అన్నారు.

More Telugu News