Krishna District: మైలవరంలో ఉద్రిక్తత.. పోలీసులపై చెప్పులు విసిరిన వైసీపీ కార్యకర్తలు.. లాఠీ ఛార్జ్!

  • మైలవరంలో నిర్వహించిన జగన్ బహిరంగ సభ  
  • పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్న వైసీపీ నేతలు 
  • కార్యకర్తలకు గాయాలు 

కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ బహిరంగ సభకు హాజరైన ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో, ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలు పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలకు చాలా మందికి గాయాలయ్యాయని అన్నారు. జగన్ సభకు హాజరైన స్థానికులను పోలీసులు ఈడ్చు కెళ్లారని, తమ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాంను నెట్టేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News