vijay rupani: కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థానీలు దీపావళి జరుపుకుంటారు: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యంగ్యం

  • ఎన్నికల వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు  
  • కాంగ్రెస్ పై సెటైర్ వేసిన గుజరాత్ ముఖ్యమంత్రి  
  •  భారతీయులు బలంగా కోరుకునేది అదే

ఎన్నికల వేళ విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'విజయ్ సంకల్ప్' ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ  కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.

"ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ వారు గెలిస్తే పాకిస్థాన్లో దీపావళి జరుపుకుంటారు. ఎందుకంటే అక్కడివారికి కాంగ్రెస్ వారు మంచి మద్దతును అందిస్తున్నారు. అందువలన ఆ పార్టీ గెలవాలని పాకిస్థానీలు ఆశపడుతున్నారు. కానీ భారతదేశ ప్రజలు మాత్రం మోదీ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. మోదీ గెలిస్తే మాత్రం పాకిస్థాన్ లో విషాద ఛాయలు అలముకుంటాయి" అన్నారు విజయ్ రూపానీ. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

More Telugu News