Andhra Pradesh: మరణశాసనం రాసుకోవాలనుకుంటేనే జగన్ కు ఓటెయ్యండి!: సీఎం చంద్రబాబు

  • అన్ని ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలి
  • అది ఓ చారిత్రక అవసరం
  • అవతల పార్టీకి డిపాజిట్ కూడా దక్కకూడదు

వైసీపీ అధినేత జగన్ ఒక్కసారి తనకు ఓటెయ్యమని ప్రజలను వేడుకుంటున్నాడని, ఎందుకు ఆయనకు ఓటెయ్యాలి? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏలూరులో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఎవరన్నా మరణ శాసనం రాసుకోవాలనుకుంటే, మన భవిష్యత్తును నాశనం చేసుకోవాలంటే, శాశ్వతంగా మనం అనాధలుగా మిగిలిపోవాలంటే, తెలంగాణ పెత్తనం కావాలంటే ఒక్కసారి జగన్ కు ఓటెయ్యండంటూ బాబు సెటైర్లు విసిరారు.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని, అది ఓ చారిత్రక అవసరమని, అవతల పార్టీకి డిపాజిట్ కూడా దక్కకూడదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడతానని, రాజీపడనని స్పష్టం చేశారు.

More Telugu News