Janasena: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్లకు ముహూర్తం ఖరారు

  • 21న గాజువాకలో, 22న భీమవరంలో నామినేషన్లు
  • గాజువాకలో ఉదయం 10.30 తర్వాత
  • భీమవరంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత  

రానున్న ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ నామినేషన్లు వేస్తారని ఓ ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది. గాజువాకలో ఉదయం 10.30-1.00 గంట మధ్య, భీమవరంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో రిటర్నింగ్ అధికారులకు పవన్ తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు పేర్కొంది.

More Telugu News