Botsa Satyanarayana Satyanarayana: చంద్రబాబు ప్రభుత్వం డేటా చోరీ కేసు నిందితుడికి సహకరిస్తోందా?: బొత్స

  • తప్పు చేశారనడానికి వారి తీరే నిదర్శనం
  • అశోక్ ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది?
  • గ్రిడ్ సంస్థ దగ్గరికి ఓటరు జాబితా ఎలా వెళ్లింది?

చంద్రబాబు ప్రభుత్వం డేటా చోరీ కేసు నిందితుడికి సహకరిస్తోందా? అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం నిందితుడికి సహకరిస్తుందేమో అనిపిస్తోందన్నారు. టీడీపీ నేతలు తప్పు చేశారనడానికి వారి తీరే నిదర్శనమన్నారు. తప్పు చేయకుంటే ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు? అసలు ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గరికి ఓటరు జాబితా ఎలా వెళ్లిందో చెప్పాలంటూ ప్రశ్నించారు.

More Telugu News