Andhra Pradesh: కర్నూలులో పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • గంటపాటు నిలిచిపోయిన రైలు
  • లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

కర్నూలు రైల్వే స్టేషన్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ తెల్లవారుజామున రైలు వేగంగా వెళ్తున్న వేళ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. అయితే, లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత మరో ఇంజిన్‌ను తెప్పించి అమర్చి రైలును పంపించారు. దీంతో రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ప్రమాద ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News