India: యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారు.. బీజేపీపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రచురించిన పాకిస్థాన్ మీడియా!

  • డాన్ వెబ్ సైట్ లో కథనం
  • భారత పత్రిక లింక్ ను జతచేసిన సంస్థ
  • యుద్ధం వస్తుందని ముందే చెప్పారన్న జనసేనాని

పాకిస్థాన్ తో యుద్ధం రాబోతోందని కొందరు బీజేపీ నేతలు తనతో చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా తెలుగు నుంచి జాతీయ మీడియాకు వెళ్లగా, తాజాగా పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ వెబ్ సైట్ పవన్ కల్యాణ్ మాటలను యథాతథంగా ప్రచురించింది. భారత్ కు చెందిన ఓ అంగ్ల పత్రిక కథనం లింక్ ను దీనికి జతచేసింది. ‘యుద్ధం వస్తుందని బీజేపీ నాయకులు నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

More Telugu News