saidharam tej: తేజు మూవీ బడ్జెట్ ను తగ్గించేశారట!

  • మైత్రీ మూవీ బ్యానర్ పై 'చిత్రలహరి'
  • 14 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • ఏప్రిల్ 12వ తేదీన విడుదల    

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా 'చిత్రలహరి' నిర్మితమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఒక నాయికగా కల్యాణి ప్రియదర్శన్ .. మరో నాయికగా నివేదా పేతురాజ్ నటించారు. ఈ సినిమాను 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్ణయించుకున్నారట. ఆ తరువాత మనసు మార్చుకుని 14 కోట్ల బడ్జెట్ లోనే సినిమాను పూర్తిచేసేశారని వినికిడి.

 ఈ మధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. వరుసగా ఆరు పరాజయాలు ఆయన ఖాతాలోకి చేరిపోయాయి. అందువల్లనే ఆయన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని, బడ్జెట్ ను కుదించారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో తేజు వున్నాడు.

  • Loading...

More Telugu News