RBI: త్వరలోనే కొత్త సిరీస్‌తో రూ. వంద నోట్లు: రిజర్వు బ్యాంకు

  • త్వరలోనే చలామణిలోకి కొత్త వంద నోట్లు
  • పాతవి యథాతథంగా కొనసాగుతాయన్న ఆర్బీఐ
  • కొత్త నోట్లపై శక్తికాంత దాస్ సంతకం

అతి త్వరలోనే సరికొత్త సిరీస్‌తో కొత్త వంద రూపాయల నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో వస్తున్న ఈ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద రూపాయల నోట్లలానే ఇవి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే చలామణిలో ఉన్న నోట్లు యథాతథంగా కొనసాగుతాయని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.

More Telugu News