Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చీరలో అందంగా కనిపిస్తానంటున్న నాయిక 
  • బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ అక్కినేని 
  • వంద కోట్ల క్లబ్బులో కంగన సినిమా 

 *  త్వరలో విడుదల కానున్న 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' చిత్రంలో తన పాత్ర 'మై హూనా' హిందీ సినిమాలో సుస్మితా సేన్ పాత్రను గుర్తుకు తెస్తుందని అంటోంది కథానాయిక రాయ్ లక్ష్మి. ఈ సినిమాలో చీరలో అందంగా కనిపిస్తానని చెప్పింది.
*  అఖిల్ అక్కినేని ఇంతవరకు చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయాన్ని సాధించలేదు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రం కోసం బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వీరి కలయికలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందట.
*  కంగనా రనౌత్ నాయికగా నటించిన 'మణికర్ణిక' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొంది బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఇండియా వసూళ్ల పరంగా చూస్తే 100 కోట్ల క్లబ్బులో చేరింది. ఇక ప్రపంచ వ్యాప్త వసూళ్లను తీసుకుంటే 150 కోట్ల నెట్ దాటినట్టు సమాచారం.

More Telugu News