rohini: తల్లి పాత్ర కోసం గుణశేఖర్ గారు అడిగితే అందుకే చేయలేదు: నటి రోహిణి

  • నందినీ రెడ్డి మా ఇంటికి వచ్చారు
  •  ఫ్రెండ్లీ మదర్ రోల్ అనగానే ఒప్పుకున్నాను
  • గుణశేఖర్ గారు నాకు  నా పాత్ర గురించి చెప్పలేదు

తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా దాదాపు 80 సినిమాలకి పైగా చేసిన రోహిణి, ఆ తరువాత నుంచి ముఖ్యమైన పాత్రలను చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొనగా, 'గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం అడిగితే ఎందుకు చేయలేదు? నందినీ రెడ్డి గారు 'అలా మొదలైంది' సినిమాలో తల్లి పాత్ర కోసం అడగ్గానే ఎందుకు ఒప్పుకున్నారు?' అనే ప్రశ్న రోహిణికి ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. " గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం నన్ను అడిగినప్పుడు నా వయసు 34 మాత్రమే. అందువలన అప్పుడే తల్లి పాత్రలు చేయడమేంటని నాకు అనిపించింది. ఆ తరువాత సంవత్సరం నందినీ రెడ్డి మా ఇంటికి వచ్చారు. తన సినిమాలో తల్లి పాత్ర చేయాలనీ చెబుతూ, మా ఇంట్లో మా అబ్బాయితో ఎలా ఉంటానో .. ఆ సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు. ఫ్రెండ్లీ మదర్ అనగానే చేయడానికి అంగీకరించాను. గుణశేఖర్ గారు నాకు నా పాత్ర ఎలా ఉంటుందని చెప్పి వుంటే చేసే దాన్నేమో" అని అన్నారు. 

More Telugu News