New Delhi: ఆడపిల్లలను కిడ్నాప్ చేసి, క్షేమంగా వదిలివేస్తున్న వ్యక్తి... కారణం తెలుసుకుని పోలీసుల అవాక్కు!

  • న్యూఢిల్లీలో వరుసగా బాలికల కిడ్నాప్
  • సీసీటీవీ ఫుటేజ్ లు చూసి పట్టేసిన పోలీసులు
  • అమ్మాయిలు లేకపోవడంతో ముచ్చట తీర్చుకుంటున్నానన్న వ్యక్తి

న్యూఢిల్లీలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ కేసులు పోలీసుల ముందుకు వస్తున్నాయి. అందరూ 8 నుంచి 12 ఏళ్లలోపు వయసున్న వారే. అయితే, కేసును విచారించే లోపే, మరుసటి రోజు తమ బిడ్డ ఇంటికి చేరిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలా కిడ్నాప్ కావడం, మరుసటి రోజు ఇంటికి వస్తుండటం... చాలా కేసులు వస్తుండటంతో, పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, ఈ పని చేస్తున్నది ఒకే వ్యక్తని తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా, అమ్మాయిల కిడ్నాప్ వెనకున్న కారణం విని అవాక్కయ్యారు.

కృష్ణా తివారి... ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్స్ లో ఉండే వ్యక్తి. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అమ్మాయిలంటే తివారీకి చాలా ఇష్టం. తనకు ఆడ పిల్లలు లేరన్న కారణంతో, రోడ్డుపై కనిపించిన అమ్మాయిని, ఇంటికి తీసుకెళ్లి, ఆమెకు కావాల్సిన వన్నీ కొనిచ్చి, మరుసటి రోజు జాగ్రత్తగా అమెను ఇంటికి చేర్చేవాడు. కుమార్తెలు లేరన్న కారణంతోనే ఇలా బాలికలను తీసుకువచ్చి ముచ్చట తీర్చుకుంటున్నామని తివారీ పోలీసులకు చెప్పగా, కేసు నమోదు చేసిన పోలీసులు, మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News