Chandrababu: కేంద్ర బడ్జెట్ విషయంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. ఢిల్లీలో ఒక రోజు దీక్ష

  • కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేయనున్న చంద్రబాబు
  • బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే దీక్ష చేపట్టాలని నిర్ణయం
  • ఢిల్లీలో దీక్షపై పార్టీ ఎంపీలతో చర్చ

బీజేపీ ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే ఢిల్లీ వేదికగా ఒక రోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అయితే బడ్జెట్ సమావేశాల చివరి రోజున దీక్షను చేపట్టాలా? లేదా ముందే చేపట్టాలా? అనే విషయంపై ఎంపీలు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News