Arvind Kejriwal: మీ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం.. ఎలా రక్షించుకుంటావో చూస్తాం: ఢిల్లీ సీఎంకు కిడ్నాపర్ల హెచ్చరిక

  • బెదిరింపు ఈ-మెయిల్స్‌తో భద్రత పెంచిన పోలీసులు
  • కేసు సైబర్ విభాగానికి అప్పగింత
  • గతంలోనూ కేజ్రీవాల్‌కు బెదిరింపులు

‘‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం.. మా నుంచి ఆమెను ఎలా రక్షించుకుంటావో చూస్తాం’’ అని హెచ్చరిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దుండగులు ఈ-మెయిల్ పంపి కలకలం రేపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరిక ఈ-మెయిల్‌తో కేజ్రీవాల్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌కు కూడా భద్రతను పెంచారు.

 జనవరి 9న ఈ-మెయిల్ వచ్చినట్టు చెప్పిన పోలీసులు దీనిని సైబర్ సెల్ విభాగానికి అందించినట్టు చెప్పారు. గతేడాది కూడా కేజ్రీవాల్‌కు ఇటువంటి హెచ్చరిక ఈ-మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో ఆయనను చంపేస్తామని హెచ్చరించారు. అయితే, కేజ్రీవాల్ కుటుంబానికి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో కేజ్రీవాల్‌ కుమార్తె హర్షితపై అసభ్యకర పోస్టు చేశాడు.

More Telugu News