Xolo Era 4X: జోలో నుండి రూ.4,444 ధరకే నూతన స్మార్ట్ ఫోన్!

  • భారత్ లో విడుదలైన 'జోలో ఎరా 4ఎక్స్' స్మార్ట్ ఫోన్ 
  • ఈనెల 9 నుండి అమెజాన్ లో విక్రయం 
  • రెండు కెమెరాలకి ఫ్లాష్

ప్రముఖ మొబైల్ సంస్థ జోలో తాజాగా రూ.4,444 ధరకే నూతన స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో విడుదల చేసింది. జోలో ఎరా 4ఎక్స్ పేరిట విడుదలైన ఈ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్లో ఈనెల 9 నుండి ప్రత్యేకంగా విక్రయించనున్నారు. 5.45" డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఈ ఫోన్ ముందు, వెనక భాగాలలో ఉన్న కెమెరాలకి ఫ్లాష్ సదుపాయాన్ని కల్పించారు.

జోలో ఎరా 4ఎక్స్ ఫీచర్లు:

  • 5.45" హెచ్‌.డీ ప్ల‌స్ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం 
  • 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫేస్ అన్‌లాక్‌, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

More Telugu News