madakasira: కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది: తిప్పేస్వామి

  • నా నాలుగేళ్ల పోరాటం ఫలించింది
  • అసెంబ్లీ స్పీకర్ ని కలిసి ‘సుప్రీం’ తీర్పు ప్రతిని ఇచ్చాం
  • ఈరన్నపై ఏపీ, కర్ణాటకల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నియోజవర్గానికి  వైసీపీ నేత తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా పరిగణించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల పోరాటం అనంతరం కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించమని అసెంబ్లీ స్పీకర్ ని కోరినట్టు వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని స్పీకర్ కు అందజేసినట్టు తిప్పేస్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఈరన్న గురించి ఆయన మాట్లాడుతూ, ఆయనపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందన్న విషయాలను తన ఎన్నికల అఫిడవిట్ లో ఈరన్న పేర్కొనలేదని అన్నారు.

More Telugu News