sharwanand: హీరోగా శర్వానంద్ .. టైటిల్ పై గట్టిగానే జరుగుతోన్న కసరత్తు

  • సుధీర్ వర్మతో శర్వానంద్ 
  • కోటి రూపాయల సెట్లో చిత్రీకరణ 
  • త్వరలోనే వదలనున్న ఫస్టులుక్

శర్వానంద్ హీరోగా రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తదుపరి సినిమాను కూడా శర్వానంద్ మూడొంతులు పూర్తిచేసేశాడు. శర్వానంద్ తదుపరి సినిమా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక షేడ్ లో మాఫియా డాన్ గాను కనిపించనుండగా, ఆయన జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనుంది.

హైదరాబాద్ శివార్లలో కోటి రూపాయల ఖర్చుతో వేసిన భారీ సెట్లోనూ షూటింగ్ చేశారు. ఇంతవరకూ ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ఖరారు కాలేదు. టైటిల్ విషయంలోనే టీమ్ అంతా గట్టి కసరత్తు చేస్తోందట. త్వరలోనే టైటిల్ ను ఫిక్స్ చేసి, ఫస్టులుక్ వదలాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. 

More Telugu News