తెలంగాణ‌లో కేసిఆర్ గాలి వీస్తోందని నేను ముందే చెప్పా: కడియం శ్రీహరి

టీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులకు ఆ పార్టీ నేత కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘తెలంగాణ‌లో కేసిఆర్ గాలి వీస్తోంది...ఈ నెల 7వ తేదీన టిఆర్ఎస్ తుపాన్ వీస్తుంది...11వ తేదీన వెల్ల‌డ‌య్యే ఫ‌లితాల సునామిలో ప్ర‌తిప‌క్షాలు కొట్టుకుపోతాయ‌ని నేను ముందే చెప్పిన‌ది నేడు అక్ష‌ర స‌త్య‌మైనందుకు, దానిని నిజం చేసినందుకు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌త్యేకంగా వ‌రంగ‌ల్ వాసుల‌కు మ‌న‌స్ఫూర్తిగా నా ధ‌న్య‌వాదాలు. గెలిచిన అభ్య‌ర్థుల‌కు హృదయ పూర్వ‌క అభినంద‌న‌లు’ అని తెలిపారు.

Telangana
Kadiam Srihari
kcr
warangal

More Telugu News