TRS: నిమిషాల్లో మారిపోయిన ట్రెండ్... రేవంత్ రెడ్డి వెనుకంజ... మల్లు భట్టి విక్రమార్క కూడా!

  • తొలి రౌండ్ లో రేవంత్ ఆధిక్యం
  • రెండో రౌండ్ లో వెనుకంజ
  • మధిరలో వెనుకబడిన మల్లు భట్టి

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రౌండ్ రౌండ్ కూ ఫలితాలు తారుమారవుతున్నాయి. కొడంగల్ నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడిన రేవంత్ రెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అయితే, రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆయన సుమారు 600 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. మధిరలో అత్యధికంగా 90 శాతానికి మించిన పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

More Telugu News