Andhra Pradesh: జగన్@ 3,416 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర!

  • ఆదివారంపేట రోడ్డు నుంచి యాత్ర ప్రారంభం
  • ప్రజలు, మద్దతుదారులను కలుసుకుంటున్న జగన్
  • రాగోలు వరకూ సాగనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజు ఆదివారంపేట రోడ్డు నుంచి 317వ రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మద్దతుదారులు, ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోని కొత్తరోడ్డు జంక్షన్ మీదుగా రాగోలు వరకూ సాగనుంది. కాగా, ఈ సందర్భంగా జగన్ ను కలుసుకునేందుకు భారీగా స్థానిక ప్రజలు గుమిగూడారు. జగన్ పాదయాత్ర ఇప్పటివరకు 3,416.1 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

More Telugu News