nagashaurya: నాగశౌర్య జోడీగా నిధి అగర్వాల్

  • కలసిరాని 'సవ్యసాచి'
  • రెండో సినిమాగా 'మిస్టర్ మజ్ను'
  • త్వరలో సెట్స్ పైకి మూడో సినిమా   

ఇటీవల కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ పేరు ముందుగా కనిపిస్తుంది. 'సవ్యసాచి'తో ఈ సుందరి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆదరణ పొందకపోయినా, అమ్మడి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలకి ముందే ఆమె 'మిస్టర్ మజ్ను' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా హిట్ అయితే ఈ సుందరి జోరు ఒక రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయికి మరో ఛాన్స్ వచ్చింది .. అదీ నాగశౌర్య జోడీగా. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కాశీ అనే నూతన దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం నిధి అగర్వాల్ ను తీసుకున్నారట. సుకుమార్ సొంత బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది.   

More Telugu News