divya spandana: కన్నడ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యపై రాజద్రోహం కింద కేసు నమోదు

  • కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ గా ఉన్న దివ్య స్పందన
  • మోదీ దొంగ అంటూ వ్యాఖ్యలు
  • లక్నోలో నమోదైన కేసు

ప్రముఖ కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ దివ్య స్పందనపై లక్నోలోని గోమ్తినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 124-ఏ (రాజద్రోహం), సెక్షన్ 67 కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 ప్రధాని మోదీని ఉద్దేశించి 'దొంగ' అని ట్వీట్ చేసినందుకు దివ్యపై సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిని తీవ్రంగా అవమానించినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని రిజ్వాన్ తెలిపారు. ఈ కేసుపై దివ్య స్పందిస్తూ... 'నిజమా.. చాలా మంచిది' అంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News