Chandrababu: చంద్రబాబుకి మెడల్స్ చూపించిన పీవీ సింధు.. అభినందించిన సీఎం

  • ఆసియా క్రీడలలో సిల్వర్ మెడల్ సాధించిన సింధు 
  • షట్లర్ సింధు మరింత ఎత్తుకు ఎదగాలి
  • సింధు విజయాలతో జాతికి స్ఫూర్తి  

ఆసియా క్రీడలు-2018లో భారత్ తరపున బ్యాడ్మింటన్ లో మొట్టమొదటి వ్యక్తిగత సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధును ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రముఖ షట్లర్ సింధు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదిస్తున్నానని, ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించినందుకు అభినందిస్తున్నానని అన్నారు. సింధు తన విజయాలతో జాతికి స్ఫూర్తి నింపడం కొనసాగాలని చంద్రబాబు తన ట్వీట్ లో ఆకాంక్షించారు.

కాగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింధు కూడా హాజరైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పీీవీ సింధును ఏ విధంగా గౌరవించాలో కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆసియా క్రీడల్లో తాను సాధించిన పతకాలను చంద్రబాబుకు సింధు చూపించగా ఆయన అభినందించారు. ఇరవై మూడేళ్ల వయసులోనే సింధు ఎంతో ఎత్తుకు ఎదిగిందని కొనియాడారు.

More Telugu News