ida bollaram: ఐడీఏ బొల్లారంలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది!

  • వినాయకనగర్ లో సంఘటన
  • పదో తరగతి విద్యార్థి నిఖిత
  • తనను ప్రేమించాలంటూ వెంటబడుతున్న అరవింద్

సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలోని వినాయకనగర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదంటూ ఓ విద్యార్థిని గొంతు కోసేశాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, విద్యార్థిని నిఖిత పదో తరగతి చదువుతోంది. ప్రేమోన్మాది అరవింద్ తనను ప్రేమించాలంటూ కొంత కాలంగా ఆమె వెంట పడుతున్నట్టు చెప్పారు. కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News