kerala floods: వరదసాయంలో బాహుబలిగా మారిన కేరళ మంత్రి.. ఫిదా అయిన నెటిజన్లు!

  • సహాయక సామగ్రిని భుజాలపై మోసుకెళ్లిన మంత్రి
  • వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు
  • బాహుబలితో పోల్చుతూ కామెంట్లు

వరదలతో అల్లాడిన కేరళ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితుల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పంపించిన సహాయక సామగ్రి వాహనాల్లో కేరళకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఓ శిబిరానికి చేరుకున్న వాహనం నుంచి సామగ్రిని దించి తన భుజాలపై మోసి తీసుకెళ్తున్న కేరళ మంత్రి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.

ఓ పునరావాస శిబిరాన్ని విద్యాశాఖ మంత్రి సి.రవీంద్రనాథ్ పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి సహాయక సామగ్రితో ఓ వాహనం చేరుకుంది. ఇది చూసిన మంత్రి తాను మంత్రినన్న విషయాన్ని మర్చిపోయి సామగ్రిని అన్‌లోడ్ చేయడంలో తానూ ఓ చేయి వేశారు. ఓ పెద్ద సంచిన తన భుజాలపై మోస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు.

 ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ అయింది. బ్యాగును మోసుకెళ్తున్న మంత్రిని చూసిన నెటిజన్లు ‘బాహుబలి’ అంటూ కొనియాడుతున్నారు. బాహుబలిలో శివలింగాన్ని మోసుకెళ్లే ప్రభాస్ ఫొటోతో మంత్రి ఫొటోను జతచేర్చి ‘బాహుబలి’ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, సహాయక చర్యల్లో ఆయన పాల్గొని సాయం అందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News