nithin: ఒక వైపున 'శ్రీనివాస కళ్యాణం' .. మరోవైపున 'విశ్వరూపం 2'

  • ఆగస్టు 9న 'శ్రీనివాస కళ్యాణం'
  • ఆగస్టు 10వ తేదీన 'విశ్వరూపం 2'
  • విభిన్నమైన కథా నేపథ్యాలు కలిగిన చిత్రాలు  

దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకుడిగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రేమ .. పెళ్లి .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరే సినిమా పోటీ లేకుండగా చూసుకుని దిల్ రాజు రంగంలోకి దిగాడు.అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా 'విశ్వరూపం 2' సినిమా రావడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కావడమనేది ఖరారైపోయింది. 'విశ్వరూపం 2' భారీ బడ్జెట్ .. భారీ తారాగణం కలిగిన సినిమా. అంతే కాకుండా కథాపరంగా .. యాక్షన్ సీన్స్ పరంగా కూడా విస్మయానికి గురిచేసే సినిమా. తొలి భాగం ఘన విజయం సాధించడం రెండో భాగానికి బాగా కలిసొచ్చే అంశం. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లకు వచ్చినా, వాటి జోనర్లు పూర్తిగా భిన్నమైనవి కావడం వలన వసూళ్ల పరంగా ఎలాంటి ప్రభావం ఉండదనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.       

More Telugu News