Bollywood: ‘ధడక్’ సినిమా లేకపోతే నా పరిస్థితి దారుణంగా వుండేది!: శ్రీదేవి కూతురు జాన్వీ

  • తల్లి మరణం తరువాత తన పరిస్థితి గురించి జాన్వీ
  • అమ్మ మృతిని తట్టుకోవడం అంత సులువైంది కాదు
  • నేను చేసుకుంటోన్న పని నాలో ధైర్యాన్ని నింపింది

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన తల్లి మరణాన్ని తాను ఎలా తట్టుకోగలుగుతున్నానో వివరించింది. ఈ విషయం అంత సులువైంది కాదని, తాను చేసుకుంటోన్న పని, తన కుటుంబం తనలో ధైర్యాన్ని నింపాయని చెప్పింది.

ఒకవేళ తాను ఈ సినిమా చేసుండకపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని జాన్వీ చెప్పింది. తన తల్లి లేదన్న బాధ నుంచి తనను ‘ధడక్‌’ సినిమాయే తేరుకునేలా చేసిందని పేర్కొంది. ఈ సినిమా తనకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నో విధాలుగా కాపాడిందని వ్యాఖ్యానించింది. ఆమె తొలి సినిమా వచ్చేనెల 20న విడుదల కానుంది.     

More Telugu News