Arvind Kejriwal: ధర్నా విరమించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

  • 9 రోజుల పాటు కొనసాగిన ధర్నా
  • మంత్రులతో కలిసి నిరసన తెలిపిన కేజ్రీవాల్‌
  • ఐఏఎస్‌ల సమ్మెకు వ్యతిరేకంగా ఆందోళన

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఆయన ధర్నా విరమించారు. ఐఏఎస్‌ల సమ్మెకు వ్యతిరేకంగా చేసిన ఆయన ధర్నా 9 రోజుల పాటు కొనసాగింది. ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో భాగంగా నిరాహార దీక్ష చేసిన ఇద్దరు మంత్రులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ చేసిన ధర్నాకు పలు రాష్ట్రాల సీఎంల మద్దతు కూడా లభించింది. 

More Telugu News