bjp: ఏపీలో అవినీతి బాగా పెరిగింది: పురందేశ్వరి

  • రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది
  • అయినా మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారు
  • బిల్లులోని ఏ ఒక్క హామీనైనా నెరవేర్చబోమని చెప్పామా?

ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందని బీజేపీ నేత పురందేశ్వరి ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా ప్రజల్లో తమను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారని టీడీపీపై విమర్శలు చేశారు. 13 జాతీయ సంస్థలు, విద్యాసంస్థలు రాష్ట్రానికి రాలేదా? బిల్లులోని ఏ ఒక్క హామీనైనా నెరవేర్చబోమని చెప్పామా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోవట్లేదని, బీజేపీపై, ప్రధానిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు.

More Telugu News