West Godavari District: జగన్‌ సభ నిర్వహించిన ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన టీడీపీ!

  • కోటిపల్లి బస్టాండ్ లో టీడీపీ నేతల వినూత్న కార్యక్రమం
  • ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన టీడీపీ నాయకులు
  • వైసీపీపై విమర్శలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద నిన్న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఈరోజు టీడీపీ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మహిళా నేతలు పసుపు నీళ్లు చల్లి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి వారంతా అక్కడి ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని టీడీపీ అభివృద్ధి చేస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.                                

More Telugu News