simbu: షూటింగ్ పూర్తిచేసుకున్న 'నవాబ్ '

  • మణిరత్నం దర్శకత్వంలో 'చెక్క చివంత వానం'
  • తెలుగు టైటిల్ గా నవాబ్ 
  • న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో సాగే కథ    

దర్శకుడిగా మణిరత్నానికి గల ప్రత్యేకతను గురించి .. పేరు ప్రఖ్యాతల గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సినిమాలో నటీనటులు ఎవరైనా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది వున్నారు. వాస్తవానికి దగ్గరగా .. దృశ్యకావ్యాలుగా తన కథలను మలిచే మణిరత్నం, ప్రస్తుతం 'చెక్క చివంత వానం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. 'అబుదాబి' .. 'సెర్బియా' వంటి ప్రాంతాల్లో జరిపిన చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. శింబు .. విజయ్ సేతుపతి .. అరవిందస్వామి .. అరుణ్ విజయ్ .. జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ తారాగణం కారణంగా ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. 

More Telugu News