keerti suresh: 'మహానటి' సక్సెస్ ను మరిచిపోలేను: కీర్తి సురేశ్

  • సావిత్రి గారి పాత్రలో చేయడం అదృష్టం 
  • దర్శక నిర్మాతలు ఎంతగానో సహకరించారు 
  • ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

సావిత్రి చనిపోయిన దగ్గర నుంచి .. అందుకు గల కారణాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానుల్లో అలా ఉండిపోయింది. వాళ్లందరి సందేహాలకు 'మహానటి' సమాధానంగా నిలిచింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల్లోను విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దర్శక నిర్మాతలతో పాటు కీర్తి సురేశ్ .. విజయ్ దేవరకొండ .. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మహానటిలో సావిత్రి గారి పాత్రను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా సమయంలో దర్శకుడిగా నాగ్ అశ్విన్ .. నిర్మాతలుగా స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నాకు ఎంతగానో సహకరించారు. నన్ను సపోర్ట్ చేసిన మీడియా వారికీ .. ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కష్టపడటం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ను నేను ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పుకొచ్చింది.     

More Telugu News