kapil sibal: రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు: కపిల్‌ సిబాల్

  • ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించినట్లు వార్తలు
  • మండిపడుతోన్న కాంగ్రెస్‌ నేతలు
  • కర్ణాటక గవర్నర్‌ తీరు రాజ్యాంగబద్ధంగా లేదన్న కపిల్‌ సిబాల్‌

కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఆహ్వానించినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మండిపడ్డారు. రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని కపిల్‌ సిబాల్‌ అన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌ నేత కుమారస్వామిని గవర్నర్‌ ఆహ్వానించాలని, ఆ బాధ్యత వజుభాయ్‌ వాలాకు ఉందని అన్నారు. కర్ణాటక గవర్నర్‌ తీరు రాజ్యాంగబద్ధంగా లేదని మండిపడ్డారు.

More Telugu News