keerti suresh: 'మహానటి' టీమ్ కి అల్లు అరవింద్ డిన్నర్ పార్టీ

  • హిట్ చిత్రాల జాబితాలో 'మహానటి' 
  • అశ్వనీదత్ ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఆహ్వానం 
  • ఈ సినిమా టీమ్ కి అభినందనలు

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ 'మహానటి' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాము ఎంతగానో అభిమానించే సావిత్రి ఇంతగా బాధలు పడిందా అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో హృదయాలకు ఈ సినిమా కనెక్ట్ కావడంతో, భారీ వసూళ్లను రాబడుతోంది. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండటంతో, ఈ సినిమా టీమ్ ను చిరంజీవి సత్కరించిన సంగతి తెలిసిందే.

 ఇక బాలకృష్ణ స్పెషల్ షో చూసి అభినందించిన విషయమూ తెలిసిందే. ఇక నిన్న రాత్రి అశ్వనీదత్ ఫ్యామిలీని అల్లు అరవింద్ ఆహ్వానించి డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ పార్టీకి అల్లు అర్జున్ తో పాటు రాజమౌళి .. కీరవాణి .. విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే ఈ సినిమాను ఇంతగా ప్రేక్షకుల మనసులకు దగ్గరగా చేసిన దర్శక నిర్మాతలను అల్లు అరవింద్ అభినందించారు. ఈ సందర్భంలో అంతా కలిసి దిగిన ఫోటోను ఇక్కడ చూడవచ్చు.  

More Telugu News